Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోధన్: భర్త మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి వచ్చి భార్యను హింసిస్తున్నాడు. కొట్టడం, తిట్టడం చేస్తున్నాడు. భర్త ప్రవర్తనతో భార్య విసిగిపోయింది. అతనితో వేగడం కష్టమని నిర్ణయించుకుంది. భర్త మద్యం మత్తులో నిద్రిస్తున్న సమయం చూసి తలపై బండరాయితో మోది హత్య చేసింది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భర్తను హత్య చేసిన అనంతరం భార్య అక్కడి నుంచి పారిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.