Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
అల్యూమినియం బాడీతో 100 వందే భారత్ రైళ్ల తయారీకి సంబంధించిన ప్రాజెక్టుకు 2 బిడ్లు దాఖలయ్యాయి. అందులో ఒకటి హైదరాబాద్కు చెందిన మేధా సర్వో డ్రైవ్స్ కావడం విశేషం.
ఈ తరుణంలో కంపెనీ స్విట్జర్లాండ్కు చెందిన స్టాడ్లర్తో కలిసి బిడ్ దాఖలు చేసింది. ఫ్రాన్స్కు చెందిన రైల్వే దిగ్గజం అల్స్తోమ్ కూడా బిడ్ వేసింది. ఈ రెండు కంపెనీలు రూ.30,000 కోట్ల కాంట్రాక్టు కోసం బిడ్లు దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టు కింద 100 వందేభారత్ రైళ్లను తయారు చేసి, 35 ఏళ్ల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఉక్కుతో రూపొందిస్తున్న రైళ్లతో పోలిస్తే అల్యూమినియం రైళ్లు తేలికగా ఉండి, అధిక ఇంధన సామర్థ్యాన్ని ఇస్తాయి. వీటిని సోనీపేట్లో తయారు చేయనున్నారు.