Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జార్జియా: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన అంతిమ ఘడియలు గడుపుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. జార్జియాలోని తన నివాసంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అమెరికా చరిత్రలో అత్యధిక కాలం బ్రతికి ఉన్న దేశాధ్యక్షుడిగా జిమ్మీ కార్డర్ పేరిట రికార్డు ఉంది. ఆయన వయసు 99 ఏళ్లు. 2018లో మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ 94 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. అమెరికా 39వ దేశాధ్యక్షుడిగా జిమ్మీ కార్టర్ సేవలు అందించారు. ఇటీవల కరోనా వల్ల ఆయన చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. 2015లో ఆయన బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. గతంలో జార్జియాలో ఉన్న మారనాథ బాప్టిస్టు చర్చిలో ప్రతి ఆదివారం ఆయన స్కూల్ పాఠాలు తీసుకునేవారు. అయితే ఆరోగ్య క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయన సంప్రదాయానికి స్వస్తి పలికారు. 1977 నుంచి 1981 వరకు అమెరికా అధ్యక్షుడిగా కార్టర్ చేశారు. ఓసారి ఆయన జార్జియా గవర్నర్ కూడా పనిచేశారు.