Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జపాన్
హొక్కయిడోలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ తెలిపాయి. తీరప్రాంత నగరాలైన కుషిరో, నెమురోలను భూకంపం వణించినా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.
స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10.27 గంటలకు భూకంపం సంభవించిందని, ఉత్తర జపాన్కు 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు. స్థానిక నిపుణులు మాట్లాడుతూ వారం పాటు భూకంపాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.