Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
2024 ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ హయాంలో దేశంలోని ప్రజాస్వామ్యంపై నిత్యం దాడి జరుగుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఛత్తీస్గఢ్ రాయపూర్ లో జరుగుతున్న పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ, ‘బీజేపీ డీఎన్ఏ లోనే పేదలపై వ్యతిరేకత ఉంది. ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని పాలించే సత్తా కాంగ్రెస్ కే ఉంది. 2024 ఎన్నికల్లోను బావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తామని’ పేర్కొన్నారు.