Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బాన్సువాడ
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ టీటీడీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 1న వస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివా్సరెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా శనివారం బాన్సువాడలోని తాడ్కోల్ రోడ్డులో గల హెలీప్యాడ్ స్థలాన్ని, పనులను పోచారం శ్రీనివా్సరెడ్డి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రూ. 23 కోట్లతో నిర్మించిన కల్యాణ కట్ట, కల్యాణ మండపం, రాజ గోపురం, మావ వీధులు, ప్రాకారం, యజ్ఞశాల వసతి గృహాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వివరించారు.