Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు ఇటువంటి సంఘటనలు జరగకుండా ఎన్ని ప్రత్యేక టీమ్ లు పెట్టినా కానీ దుండగుల చైన్ స్నాచింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో చైన్ స్నాచింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే చైన్ స్నాచింగ్ జరిగింది. గోకుల్ నగర్ బస్తీలో విజయ్ కుమారి (57) అనే మహిళా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి చైన్ స్నాచింగ్కు పాల్పపడ్డాడు. అనంతరం నిందితుడు ఆమెపై దాడికి పాల్పడి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసులు దొంగలించి అక్కడి నుండి పరారయ్యాడు. ఈ ఘటన స్థానికంగా గోకుల్ నగరంలో కలకలం రేపుతోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎలా వచ్చాడు..ఎలా వెళ్లాడు..అనేది సీసీ కెమెరాల ద్వారా దృశ్యాలలో పరిశీలిస్తున్నారు.