Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై: మహారాష్ట్రలోని కస్బా పేట్, పింప్రి చించ్వాద్ శాసన సభ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన-బీజేపీ కూటమి, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మద్దతుగల మహా వికాస్ అఘాడీ మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కస్బా పేట్ ఎమ్మెల్యే ముక్త తిలక్, పింప్రి చించ్వాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తప్ మరణించడంతో ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్లకు 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేయించారు. సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే తదితరులు ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ముమ్మరంగా ప్రచారం చేశారు.