Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప: మాజీమంత్రి వివేకా హత్య కేసులో వైకాపా నేత, ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి విచారణపై ఉత్కంఠ నెలకొంది. శనివారం ఉదయం కడప కారాగారంలోని అతిథి భవనంలో సీబీఐ ముందు ఆయన హాజరుకానున్నట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్ నుంచి సీబీఐ బృందం కడప చేరుకుని ఓ హోటల్లో బస చేసింది. విచారణకు రమ్మంటారా.. అంటూ భాస్కరరెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎస్పీ రాంసింగ్ ఫోన్కు మెసేజ్ పంపి.. సమాధానం కోసం వేచి చూశారు. ఎంతకూ పిలుపు రాకపోవడంతో పులివెందులకు వెళ్లిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అనుచరులు కారాగారం వద్ద ఉత్కంఠతతో ఎదురు చూశారు.