Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గాంధీనగర్
గుజరాత్లో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ తెలిపింది. ఈ తరుణంతో గుజరాత్లోని రాజ్కోట్కు ఉత్తర వాయువ్యంగా 270 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఒక్కసారిగా వచ్చిన భూకంపంతో జనం ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో ఇంతకు ముందు అమ్రేలి జిల్లాలో ఫిబ్రవరి 4న ఉదయం 7.41 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ తెలిపింది.