Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
మార్చి 3 నుంచి 7 వరకు తిరుమలలో సాలకట్ల తెప్పోత్సవాలు జరుగుతాయని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తెప్పోత్సవాల్లో తొలిరోజు మార్చి 3న సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో స్వామివారు తెప్పలపై పుష్కరిణిలో విహరించి భక్తులకు కనువిందు చేస్తారు.
రెండో రోజు మార్చి 4న శ్రీ కృష్ణస్వామి అవతారంలో 3సార్లు భక్తులకు దర్శనిమిస్తారు. 5న మలయప్పస్వామి 3 సార్లు పుష్కరిణిలో విహరించి భక్తులను అనుగ్రహిస్తారు. మార్చి 6న ఐదు సార్లు, మార్చి 7న ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తాని తెలియజేశారు. ఈ తరుణంతో తెప్పోత్సవాల కారణంగా మార్చి 3, 4 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 5, 6, 7 తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేశారు.