Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పంజాబ్
తరణ్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఆదివారం జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్స్టర్లు మరణించారని పోలీసులు తెలిపారు. గత ఏడాది గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో ఇద్దరికీ సంబంధం ఉందని వారు తెలిపారు. వారు ఇతర కేసులు కూడా ఎదుర్కొంటున్నారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుర్మీత్ సింగ్ చౌహాన్ తెలిపారు.
ఈ ఘర్షణలో ఒక ఖైదీ గాయపడ్డాడని తెలిపారు. ముగ్గురూ ఒకే వర్గానికి చెందినవారు అని చౌహాన్ తెలిపారు. సిద్ధూ మూసేవాలా హత్యకేసులో నిందితులుగా ఉన్న మన్దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్, కేశవ్ల మధ్య తరన్ తరణ్ జిల్లాలోని జైలులో ఆదివారం సాయంత్రం గొడవ జరిగింది. గ్యాంగ్స్టర్స్ ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్లు మన్దీప్ తూఫాన్, మన్మోహన్ సింగ్ మృతి చెందగా మరో గ్యాంగ్స్టర్ కేశవ్కు తీవ్రంగా గాయాలయ్యాయి.