Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఈనెల 2న కె.విశ్వనాథ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆయన సతీమణి జయలక్ష్మి(86) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన చనిపోయిన 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.