Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)కి చెందిన పీజీ మొదటి సంవత్సరం(అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతి..సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి ఆదివారం రాత్రి మృతి చెందింది. కాగా, ఈ ఘటన మరువక ముందే మరో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రేమోన్మాది వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నర్సంపేటలో సంచనలం రేపుతోంది. ప్రేమోన్మాది రాహుల్ తరచూ వేధింపులకు గురి చేయడంతో యువతి రక్షిత వేధింపులు భరించలేక వరంగల్లోని తమ బంధువుల ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నర్సంపేటలోని ఓ ఇంంజనీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతోంది రక్షిత. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రక్షిత మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసుపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.