Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కూకట్పల్లి ప్రశాంత్నగర్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి షాప్ మొత్తానికి విస్తరించడంతో మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం వల్ల ఎవరికి ఎలాంటి హాని జరుగలేదని తెలిపారు.