Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్ లోని సిటీన్యూరో ఆసుపత్రిలో ఆయనను కుటుంబసభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను కేసీఆర్ రాజ్యసభకు పంపారు. అయితే టీఆర్ఎస్ లో ఆయన ఇమడలేకపోయారు. సొంత పార్టీ నుంచే ఆయనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకుగా లేకపోడం గమనార్హం. ఆయన కుమారుడు ధర్మపురి అర్వింది బీజేపీ ఎంపీగా ఉన్నారు.