Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ
హైదరాబాద్ నిమ్స్లో చికిత్స పొందుతూ మృతిచెందిన పీజీ వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి (26) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం జనగామ జిల్లాలోని స్వగ్రామం గిర్నితండాకు ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లారు.
అనంతరం మధ్యాహ్నం మృతదేహాన్ని ట్రాక్టర్పై ప్రీతి ఇంటికి సమీపంలోని వారి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. అంత్యక్రియలకు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీకి చెందిన మాజీ ఎంపీ రవీందర్నాయక్, కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నేతలు, జీసీసీ ఛైర్మన్ గాంధీనాయక్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.