Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుజరాత్
గుజరాత్లోని కచ్, అమ్రేలిలో సోమమవారంనాడు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి కచ్లో తీవ్రత 3.8గా నమోదు కాగా, అమ్రేలిలో 3.3 తీవ్రత నమోదైంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, కచ్ జిల్లాలో ఉదయం 10.49 గంటల ప్రాంతంలో 3.8 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. లఖ్పట్ టౌన్కు 62 కిలోమీటర్ల దూరంలో, 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రెండవది అమ్రేలి జిల్లా మిటియాల గ్రామానికి సమీపంలో 7.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మధ్యాహ్నం 1.42 గంటలకు ఈ ప్రకంపనలు చోటుచేసుకునట్టు గాంధీనగర్లో ఐఎస్ఆర్ తెలిపింది.