Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వికారాబాద్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఓ హెడ్ కానిస్టేబుల్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ తరుణంలో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు డెడ్బాడీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడిని వికారాబాద్ డీటీసీలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న నరసింహస్వామిగా పోలీసులు గుర్తించారు. స్వామి ఆత్మహత్యకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.