Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
అగ్నిపథ్ పథకాన్ని సమర్థించిన న్యాయస్థానం అది జాతీయ ప్రయోజనాల కోసం రూపొందించిందని ఢీల్లీ హైకోర్టు తెలిపింది. సాయుధ బలగాలను మరింత మెరుగుపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని తీసుకువచ్చిందని అందులో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.
అగ్నిపథ్ నియామకం పద్ధతిని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకూ వెళ్లింది. వీటిని పరిశీలించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేరళ, పంజాబ్, హరియాణా, బిహార్, ఉత్తరాఖండ్ హైకోర్టుల్లోనూ దాఖలైన పిటిషన్లను ఢీల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని గతంలో సూచించింది. ఇలా వచ్చిన పిటిషన్లపై గతేడాది డిసెంబర్ 15న విచారణ పూర్తిచేసిన ఢీల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.