Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తంగా 21 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 27న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా, నిర్ణీత సమయంలోపు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఎవరూ ఉపసంహరించుకోలేదు.
దీంతో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక ప్రకటించారు. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.