Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
వరుసగా ఏడు రోజులు నష్టాల్లోంచి స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ఆరంభమైనా ఆ తర్వాత లాభాల్లోకి పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో కొనుగోళ్లు జోరందుకున్నాయి. దీంతో ఉదయం 9.25 నిమిషాలకు సెన్సెక్స్ 76 పాయింట్లు లాభపడి 59,364 వద్ద నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 17,402 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్ విలువ 23పైసలు నష్టంతో 82.93 వద్ద ట్రేడవుతోంది.