Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ఏపీలో ఎస్సై ఉద్యోగాలను నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51, 288 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 57,923 మంది అర్హత సాధించారు.
ఈ క్రమంలో అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్లు రిక్రూట్మెంట్బోర్డు తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.