Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై కాళోజీ విశ్వవిద్యాలయానికి తెలంగాణ రాజ్భవన్ లేఖ రాసింది. దీనిలో గవర్నర్ తమిళిసై ఆదేశాల మేరకు ప్రీతి మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని తెలిపింది. ర్యాగింగ్, వేధింపుల తరహా ఘటనలు జరిగినపుడు తీసుకునే చర్యలకు సంబంధించిన ఎస్ఓపీలపై సమగ్ర నివేదిక అందించాలని రాజ్భవన్ కోరింది.
మెడికోలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పనిగంటలు వైద్యకళాశాలలు, ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆమెను నిమ్స్కు తరలించకుండా వరంగల్ ఎంజీఎంకే వైద్య నిపుణులు, అత్యాధునిక పరికరాలను తరలించి మెరుగైన చికిత్స అందించాల్సిందని అభిప్రాయపడింది.