Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భద్రాచలం
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 22 నుంచి ఏప్రిల్ 5 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. మార్చి 30న ఆలయ సమీపంలోని మిథిలా మండపంలో నిర్వహించే కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ తరుణంలో ఇందుకు సంబంధించిన టికెట్లను బుధవారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నట్లు రామాలయం ఈవో రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. www.bhadrachalamonline.com వెబ్సైట్లో రూ.7,500, రూ.2,500, రూ.2 వేలు, రూ.1000, రూ.300, రూ.150 టికెట్లు ఉంటాయన్నారు. రూ.7,500 టికెట్పై ఇద్దరికి ప్రవేశం కల్పించి స్వామివారి ప్రసాదం అందజేస్తారు. మిగతా వాటిపై ఒక టికెట్పై ఒకరికే అవకాశం కల్పిస్తారు. మొత్తంగా 16,860 మంది టికెట్లతో మండపంలోను, 15 వేల మంది స్టేడియం నుంచి ఉచితంగా కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. రూ.7,500 టికెట్లను ఆన్లైన్తో పాటు ఆలయ కార్యాలయంలోనూ బుధవారం నుంచి విక్రయించనున్నారు.