Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నార్సింగ్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. సాత్విక్ అనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్లాస్ రూంలోనే ఉరి వేసుకుని సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కనీసం సాత్విక్ను తక్షణమే ఆస్పత్రికి తరలించేందుకు సైతం యాజమాన్యం ముందుకు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులే ఓ బైకర్ను లిఫ్ట్ అడిగి స్నేహితులు ఆస్పపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే సాత్విక్ మరణించినట్లు తెలుస్తుంది. సాత్విక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాత్విక్ ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.