Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశంకానున్నారు. ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బీర్బాక్, బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్తో పాటు పలు ఐరోపా దేశాల విదేశాంగ మంత్రులు హాజరుకానున్నది. దీంతో బుధవారం విదేశీ అతిథులకు స్వాగతం పలికే కార్యక్రమం ఏర్పాటు చేయగా గురువారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
ఈ తరుణంలో ఆహారం, ఇంధన భద్రత, తీవ్రవాదం, మానవతా సహాయం, విపత్తుల సహాయం తదితర అంశాలపై చర్చించే అవకాశలున్నాయి. జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్లను భారత్ అతిథులుగా ఆహ్వానించింది. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో త్జాన్, ఆస్ట్రేలియాకు చెందిన పెన్నీ వాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి యువరాజ్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇండోనేషియాకు చెందిన రెట్నో మార్సుడి, అర్జెంటీనా విదేశాంగ మంత్రి శాంటియాగో కెఫిరో సమావేశాలకు హాజరుకానున్నారు.