Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 12 కడప కేంద్ర కారాగారంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో సీబీఐ తెలిపింది.
పులివెందులలోని భాస్కర్రెడ్డి నివాసానికి వెళ్లి నోటీసులను అందజేసింది. గతనెల 23 విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇవ్వగా ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో రాలేకపోతున్నట్లు ఆయన సమాచారం ఇచ్చారు. ఈ తరుణంలో ఈనెల 12న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.