Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్వీకరించి, వాటిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు.
ఈ పరిణామాల క్రమంలో వారి స్థానాలను భర్తీ చేసేందుకు తన కేబినెట్లోకి సీఎం కేజ్రీవాల్ ఇద్దరు కొత్తవారిని తీసుకున్నారు. ఎమ్మెల్యేలు సౌరభ్ భరద్వాజ, అతిషీ ఢిల్లీ కేబినెట్లో మంత్రి పదువులు చేపడతారని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.