Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ అమరావతి: ఏపీలో కొత్తగా మరో 6 మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్, రూరల్ మండలాలుగా, మచిలీపట్నాన్ని మచిలీపట్నం సౌత్, నార్త్ మండలాలుగా విభజించనున్నట్టు తెలిపింది. మచిలీపట్నంలోని 1-19, 40 వార్డు, 18 గ్రామాలను మచిలీపట్నం నార్త్గా.. మచిలీపట్నం పరిధిలోని 20-39 వార్డులు, మచిలీపట్నం రూరల్ సహా 12 గ్రామాలను మచిలీపట్నం సౌత్ మండలంగా విభజించింది. మండలాల విభజనపై అభ్యంతరాలుంటే తెలపాలని కోరింది. నెలలోగా అభ్యంతరాలను కలెక్టర్కు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది.