Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్లో శ్రద్ధావాకర్ హత్యకేసు లాంటి ఘటన వెలుగు చూసింది. ఫిబ్రవరి 24న సాఢ్ పోలీస్స్టేషను పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. జహానాబాద్కు చెందిన రామ్సాగర్కు కొన్నేళ్ల క్రితం శాలుతో వివాహమైంది. భార్యతో ఇటీవల గొడవపడి పదునైన ఆయుధంతో ఆమెను అతి కిరాతకంగా రామ్సాగర్ హత్య చేశాడు.
శరీర భాగాలను ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచిలో దాచాడు. ఈ హత్యకు అతడి సోదరులు విద్యాసాగర్, శివసాగర్ సైతం సహాయం చేశారు. అనంతరం తెలిసిన ఆటో డ్రైవర్లు మోను, నీరజ్ తివారీల సాయంతో శరీర భాగాలను ఆటోలో తీసుకువెళ్లి వివిధ ప్రాంతాల్లో విసిరేశారు. అయితే రోడ్డుపై దొరికిన మహిళ శరీర భాగాల ఆధారంగా విచారణ చేపట్టగా ఈ దారుణం బయటపడినట్లు డీసీపీ సల్మాన్తాజ్ పాటిల్ తెలిపారు.