Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నాగ్పూర్
బంగ్లాదేశ్కు చెందిన సలామ్ఎయిర్ ఓవీ406 విమానం 200 మంది ప్రయాణికులతో బంగ్లాలోని చిట్టగాండ్ నుంచి ఒమన్ రాజధాని మస్కట్ వెళ్తున్నది. అయితే విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్ గుర్తించాడు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం అందించాడు.
దీంతో మహారాష్ట్రలోని నాగ్పూర్ విమానాశ్రయంలో విమానాన్ని దించడానికి అధికారులు అనమతించారు. ఈతరుణంలో విమానాశ్రయంలో అత్యతవసర పరిస్థితి ప్రకటించారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో మొత్తం 200 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కార్గో ఏరియాలోనే పొగలు వచ్చాయని వెల్లడించారు. ప్రయాణికులను పైలట్ అప్రమత్తం చేశాడని తెలిపారు.