Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల వవనాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి.
ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 126 పాయింట్ల నష్టంతో 59,284 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 17,407 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.57 దగ్గర ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో బజాజ్ ఫిన్సర్వ్, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, టీసీఎస్, టెక్ మహీంద్రా, మారుతీ, టాటా మోటార్స్, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.