Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆంధ్రప్రదేశ్
జనవరిలో కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ క్రమంలో ప్రియురాలి వివాదంతో యువకుని హత్య కేసును చేధించారు పోలీసులు. మురళీకృష్ణను హత్య చేసింది స్నేహితులు దినేష్ కుమార్, కిరణ్ కుమార్గా గుర్తించారు.
దినేష్ కుమార్ ప్రియురాలు నగ్న వీడియోలను ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకుని మురళీకృష్ణ బ్లాక్ మెయిల్ చేసినట్టుగా గుర్తించారు. అయితే, మురళీకృష్ణ వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యాత్నం చేసింది. దీంతో ప్రియురాలిని వేధించాడని కక్ష పెంచుకున్న దినేష్ జనవరి 25వ తేదీన మురళీకృష్ణను పంచలింగాల దగ్గరకు తీసుకుకెళ్లాడు. తన ప్లాన్ ప్రకారం కత్తితో గుండెలపై పొడిచాడు. దీంతో, మురళీ కృష్ణ అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ హత్య కోసం దినేష్ కుమార్ తన స్నేహితుడు కిరణ్ కుమార్ సాయం తీసుకున్నాడు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని నగర శివారులోని హంద్రీనీవా కాలువలో పడేశారు. అయితే, తన కుమారుడు కనిపించడం లేదని ఆందోళనకు గురైన మురళీకృష్ణ కుటుంబం. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు. దర్యాప్తు చేపట్టగా లవర్ కోసం దినేష్ కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుడి ఇచ్చిన సమాచారం మేరకు మురళీకృష్ణ మృతదేహం కోసం హంద్రీనీవా కాలువ లో 10 కిలోమీటర్ల మేర గాలించినప్పటికీ ఇంకా మురళీకృష్ణ మృతదేహం దొరకలేదు.