Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఈ సాయంత్రం కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బచ్చుల అర్జునుడు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. జనవరి 28న ఆయన గుండెపోటుతో కుప్పకూలగా, విజయవాడ రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు స్టెంట్ అమర్చారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నట్టు తెలుస్తోంది. రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంతో ఆయన పరిస్థితి విషమించినట్టు భావిస్తున్నారు. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందినవారు. ఆయన బందరు మున్సిపల్ చైర్మన్ గా ప్రస్థానం ఆరంభించారు. 2014లో జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాఉ. టీడీపీ కేంద్ర కమిటీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గా కూడా అర్జునుడు పనిచేశారు. ఆయన 2017లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.