Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. దీంతో ఆమెను ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్లో చేర్పించారు. బ్రాంకైటీస్ వ్యాధికి సోనియా చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆమె హాస్పిటల్లో చేరడం ఇది రెండవసారి. జనవరిలో కూడా శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్తో ఆమె బాధపడ్డారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో కూడా పలుమార్లు ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే.