Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురు ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నారన్న పక్కా సమాచారం అందుకున్నాక పోలీసులు వారిపై నిఘా పెట్టి, అడ్డంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 180 ఇంజెక్షన్లు, 1100 ట్యాబ్లెట్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సయ్యద్, నరేష్, ఓం ప్రకాశ్లుగా పోలీసులు గుర్తించారు.
ఈ ముగ్గురిలో ఓం ప్రకాశ్ ప్రధాన నిందితుడు. విశాఖకు చెందిన ఇతను గత కొంతకాలం నుంచి హైదరాబాద్లోని సనత్నగర్లో ఉంటున్నాడు. కూకట్పల్లిలో ఫ్రీలాన్సింగ్ జిమ్ ట్రైనర్గా పని చేసే ఓం ప్రకాశ్ ఈజీ మనీకి అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే అతడు యువతకు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తమ విచారణలో తేల్చారు. తక్కువ సమయంలో బాడీ బిల్డింగ్స్ కోసం స్టెరాయిడ్స్ వాడుతుంటారని, దీని వల్ల గుండెపోటు, హార్మోన్స్ సమస్య తలెత్తుతాయని డాక్టర్లు చెప్తున్నారు.