Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్కు తొలిసారిగా ఒక మహిళ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా చారుసిన్హా నియమితులయ్యారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని సదరన్ సెక్టార్ కేంద్ర కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఐజీపీ మహేశ్చంద్ర లడ్హా సీఆర్పీఎఫ్ జమ్మూ సెక్టార్కు బదిలీ అయ్యారు. చారు సిన్హా శ్రీనగర్ సెక్టార్లో రెండున్నరేండ్లపాటు ఐజీగా పని చేశారు. జమ్మూ సెక్టార్లో ఏడాది పాటు ఐజీగా పని చేసిన ఆమె.. సీఆర్పీఎఫ్ చేపట్టిన పలు యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో కీలకపాత్ర పోషించారు. బీహార్ సెక్టార్లో పని చేస్తున్న యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో కూడా ఆమె కీలకంగా ఉన్నారు. సీఆర్పీఎఫ్కు వెళ్లడానికి ముందు తెలుగు రాష్ర్టాల్లో పలు పోస్టుల్లో పని చేసి, సమర్థురాలైన అధికారిగా పేరు సంపాదించారు.