Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసుతో యువతికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. హత్యలో యువతి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. నిందితుడు హరిహర కృష్ణ నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నామని ..అతడికి సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుందని.. ఇపుడే స్పందించలేమన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న పోలీసులు సీన్ రికన్ స్ట్రక్షన్ పూర్తి చేశారు. నవీన్ హత్యకు అమ్మాయికి సంబంధం ఉండొచ్చని నిందితుడు హరిహర కృష్ణ తండ్రి ఆరోపించారు. అలాగే నిందితుడు నవీన్ ను హత్య చేసిన తర్వాత అమ్మాయితో మాట్లాడినట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ హత్యకు అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో నవీన్ హత్యకి అమ్మాయికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు.