Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బిల్డర్ ఠాకూర్ శైలేందర్సింగ్ (47) శుక్రవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన ఇంటి తలుపు మూసి లిఫ్ట్ వద్ద వేచి చూస్తూ కుప్పకూలినట్లు.. శనివారం సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా బయటపడింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గోదావరిఖనిలోని ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న శైలేందర్ సింగ్ ఉదయం వేములవాడలోని తన సోదరుడి వద్దకు వెళ్లేందుకు బ్యాగ్తో బయటకు వచ్చి తాళం వేశారు. ఛాతీ వద్ద రుద్దుకుంటూ ఆయన లిఫ్టు వద్దకు వెళ్లి మీట నొక్కారు. బ్యాగ్ పక్కన ఉంచి ఇబ్బందిగా బయటకు చూస్తూ నిలబడ్డారు. కొన్ని సెకన్లలోనే ఆయన వెనక్కి పడిపోయి మృతి చెందారు. డీసీసీ అధ్యక్షుడు మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్కు ఈయన సోదరుడు.