Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. విచారణకు ఈనెల 6న హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొంది. సీబీఐ అధికారులు పులివెందులలోని ఎంపీ ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు. అయితే 6వ తేదీన విచారణకు రాలేనని ఎంపీ చెప్పగా.. కచ్చితంగా రావాల్సిందేనని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు సీబీఐ అధికారులు అవినాష్రెడ్డిని విచారించారు. జవవరి 28, ఫిబ్రవరి 24న విచారించిన అధికారులు.. వివేకా హత్యకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు.