Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - థానే
అలీబాబా దస్తాన్ ఏ కాబుల్ టీవీ సీరియల్ ఫేమ్ తునిషా శర్మ (21) మృతి కేసులో ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. దాంతో ఇవాళ థానే సెంట్రల్ జైలు నుంచి అతడు విడుదలయ్యాడు. తునిషా శర్మ గత ఏడాది డిసెంబర్ 24న షూటింగ్ సెట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది.
దాంతో షీజాన్ ఖానే ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణలపై పోలీసులు డిసెంబర్ 25న షీజాన్ను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి షీజాన్ విచారణ అనంతరం షీజాన్ను థానే సెంట్రల్ జైలుకు పంపించారు. అప్పటి నుంచి అతను జైల్లోనే ఉన్నాడు. ఇటీవల పాల్ఘర్ జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా శనివారం బెయిల్ మంజూరైంది. దాంతో ఇవాళ షీజాన్ జైలు నుంచి విడుదలయ్యాడు.