Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ప్రత్తిపాడు
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన టీడీపీ నేత, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా భౌతికకాయానికి వైసీపీ నేతలు నివాళులర్పించారు. ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ దొరబాబు తదితరులు రాజా మృతికి సంతాపం తెలిపి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. ఈ తరుణంలో రాజా మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారని కన్నబాబు వెల్లడించారు.