Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఇందిరాగాంధీ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో బంగారం భారీగా పట్టుబడింది. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. టాయిలెట్ నుంచి సుమారు 2 కోట్ల విలువైన నాలుగు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు.
అంతర్జాతీయ ప్రయాణాలకు ఉపయోగించే విమానం రెండు డొమెస్టిక్ ట్రిప్ లు వెళ్లొచ్చింది. ఎయిర్ పోర్టులోని టర్మినల్ 2లో ఆగింది. ఈ తరుణంలో విమానంలో సోదాలు చేశారు. వాష్ రూమ్ లో సింక్ కింద ఓ బూడిద రంగు సంచిని అతికించి ఉండటం గమనించాం. దాన్ని తీసి చూడగా అందులో 4 బంగారు బిస్కెట్లు కనిపించాయి అని కస్టమ్స్ అధికారులు వివరించారు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు తూకం వేయగా 3.969 కిలోల బరువు ఉన్నాయి. వీటి ధర రూ.2 కోట్ల దాకా ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద బంగారం, ప్యాకింగ్ మెటీరియల్ ను జప్తు చేశామని వివరించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. నాలుగు బంగారు కడ్డీల మొత్తం విలువ రూ. 1,95,72,400 అని అధికారిక ప్రకటనలో తెలిపింది.