Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కెబినేట్ సబ్ కమిటి 50 మంది కంటే తక్కువ విద్యార్ధులు ఉన్న హస్టల్స్ దగ్గరలోని హస్టల్స్ లో వీలీనం చేయడం లేదా పోస్ట్ మెట్రిక్ హస్టల్స్ గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆలోచన విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. పేద విద్యార్ధులు ప్రధానంగా గ్రామీణ, ఆదివాసీ, దళిత విద్యార్ధుల విద్యాభివృద్ధికి పట్టుకోమ్మలుగా హస్టల్స్ ఉన్నాయి. విద్యార్ధులను దగ్గరలో ఉన్న హైస్కూల్స్ నుండి హస్టల్స్ లో చేర్పించాల్సిన భాద్యత ప్రభుత్వానిది కానీ వారికి మెరుగైన సదుపాయాలు,మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచకుండా నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. వాటీని అభివృద్ధి పర్చకుండా వీలీనం పేరుతో, క్రమబద్ధీకరణ పేరుతో మూసివేసే కుట్రలు చేయడం దుర్మార్గపు చర్య తక్షణమే నిధులు మంజూరు చేసి హస్టల్స్ సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాని హెచ్చరిస్తుంది.