Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబాబాద్
మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మహిళలకు కానుకగా మహిళా ఆరోగ్య పథకాన్ని తీసుకురానున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు చైర్ పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు అధ్యక్షతన ముందస్తూ మహిళా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే మహిళలకు మహర్దశ వచ్చిందని, మహిళల సాధికారత కోసం అనేక పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. అభయ హస్తం మహిళల్లో అర్హులైన వారికి పెన్షన్లు ఇచ్చేందుకు సీఎం నిర్ణయించారని వివరించారు.స్త్రీ నిధి ద్వారా 18వేల కోట్ల రుణాలు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందజేయనున్నట్లు వెల్లడించారు.