Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్: టైప్-1 మధుమేహ బాధితులకు వరంగా మారగల సరికొత్త విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్ జనరల్ ఆసుపత్రి (ఎంజీహెచ్) పరిశోధకుల నేతృత్వంలోని బృందం తాజాగా అభివృద్ధి చేసింది. ఈ రకం మధుమేహుల్లో- ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలపై సొంత రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంటుంది. బీటా కణాల మార్పిడి ద్వారా వారికి సాంత్వన చేకూర్చవచ్చని పరిశోధకులు తేల్చారు. అయితే అందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలు ప్రభావవంతంగా పనిచేయడం లేదు. కాలేయానికి జోడించిన బీటా కణాల్లో దాదాపు సగం.. రోగనిరోధక వ్యవస్థ దాడితో ధ్వంసమవుతున్నాయి. ఇందుకు పరిష్కార మార్గంగా- పేగులను చుట్టి ఉండే ఒమెంటమ్తో బీటా కణాలను అనుసంధానించే విధానాన్ని కనుగొన్నారు. ఇందులో బీటా కణాలు కృత్రిమ క్లోమం తరహాలో పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు. వాటిపై రోగ నిరోధక వ్యవస్థ ప్రతికూల ప్రభావం చూపబోదని పేర్కొన్నారు.