Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఆమ్ఆద్మీ నేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో మార్చి 20వరకు ఆయన తిహార్ జైల్లో ఉండనున్నారు.
ఐదు రోజుల సీబీఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణం కేసులో వచ్చిన ఆరోపణలపై ఫిబ్రవరి 26న సిసోదియాను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఆయనకు ఐదు రోజుల సీబీఐ కస్టడీ విధించింది. తాజాగా అది పూర్తికావడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచారు. అనంతరం కస్టడీని పొడిగించమని సీబీఐ కోరకపోవడంతో 14 రోజుల జ్యుడీషియ్ కస్టడీ విధించినట్లు సమాచారం.