Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ తరుణంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 415 పాయింట్లు లాభపడి 60,224కు ఎగబాకింది. నిఫ్టీ 117 పాయింట్లు పెరిగి 17,711 వద్ద స్థిరపడింది. యుటిలిటీస్, పవర్, ఇన్ఫ్రా సూచీలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.