Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రాయచూరు
ఇంట్లో చెలరేగిన మంటలకు తల్లి, ఇద్దరు కుమార్తెలు సజీవ దహనమైన దుర్ఘటన రాయచూరు తాలూకా శక్తినగర్ కేపీసీఎల్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. మృతులను రంజిత(33), మృదుల(13), తారుణ్య(05)గా శక్తినగర్ ఠాణా పోలీసులు గుర్తించారు. ఏసీలో పేలుడు సంభవించి మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. మంటలకు స్పష్టమైన కారణం తెలియరాలేదు. రాయచూరు డీఎస్పీ సత్యనారాయణ, శక్తినగర్ పీఎస్సై సంఘటన జరిగిన ఇంటి వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు. మండ్య జిల్లాకు చెందిన సిద్దలింగయ్య శక్తినగర్ థర్మల్ కేంద్రంలో ఏఈగా పనిచేస్తున్నారు. ఇతడు ఇంట్లో లేని సమయంలో ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతదేహాలను రిమ్స్ శవాగారానికి తరలించారు. దట్టమైన పొగ చుట్టుపక్కల ఇళ్లను ఆవరించింది. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.